మేం దావోస్‌ వెళ్లం.. వాళ్లనే రప్పిస్తాం.. ఏపీ మంత్రి ధీమా?

Chakravarthi Kalyan
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కోసం దేశ విదేశాల్లో రోడ్ షో లు నిర్వహిస్తామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అంటున్నారు. ఈ ఏడాది దావొస్ కు వెళ్లకుండా పారిశ్రామిక వేత్తలను ఇక్కడకు ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. 2023 మార్చి 3,4 తేదీల్లో విశాఖ ఏయూ గ్రౌండ్స్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. పెట్టుబడుల సదస్సు ను నిర్వహించేందుకు మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ పని చేస్తున్నాయని మంత్రి అమర్నాథ్ అన్నారు.


దేశ విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెబ్ సైట్ ను ప్రారంభించామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. సమయం, వనరులు వృధా చేయకుండా 12 ముఖ్యమైన రంగాల పై దృష్టి పెట్టామని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెష్ట్ మెంట్ సమ్మిట్ లోగో ను ప్రాచుర్యం చేసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నమంత్రి అమర్నాథ్.. ఇందుకోసం ఈవెంట్ మేనేజ్మెంట్ కమిటీ తో చర్చించి కార్యక్రమాలు రూపొందించనున్నట్లు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: