కేసీఆర్ ఫామ్హౌజ్ కొంటామంటున్న బీజేపీ?
అలాగైతే కేసీఆర్ ఫాంహౌస్కి ఎకరానికి 15లక్షలు మేము ఇస్తామని కేసీఆర్ భూములు ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ సవాల్ చేశారు. ఆ భూమిని ప్రాజెక్టు నిర్వాసితులకు పంచుతామని రాణి రుద్రమ పేర్కొన్నారు. కామారెడ్డిలో యువ రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021వరకు దాదాపు 6వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ వివరించారు. నకిలీ విత్తనాలు మార్కెట్లో చెలామణి అవుతుంటే సీఎం చేతులు ముడుచుకొని కూర్చున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు.