మంత్రి రోజా ఇంటి ముందు తొడగొట్టిన జనసేన నేత?
రాజకీయంగా ఏదైనా ఉంటే ముఖాముఖి చూసుకోవాలని ఇలా తన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలా తీసుకెళ్లడం సమంజసమా అని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ప్రశ్నించారు. స్టేషన్ కి తీసుకెళ్లిన పోలీసులు ఏ కేసు పెట్టాలో కూడా తెలియకుండా దాదాపు పది పేపర్లు రాసి చించారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అన్నారు. చివరికి నాన్ బైయిలబుల్ కేసును నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారని తెలిపారు. మంత్రి రోజాపై అధికార, చట్ట దుర్వినియోగం కేసు పెడతామన్న జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. విడుదలయ్యాక ర్యాలీ నిర్వహించి.. మంత్రి రోజా ఇంటి ముందు తొడగొట్టారు.