నేను తలచుకుంటే 5 నిమిషాల్లో.. బొత్స ఆగ్రహం?
అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని... రెండు మూడు ఛానెల్స్ నాపై ప్రచారం చేస్తే నేను బెదరనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేస్తున్నామన్న మంత్రి బొత్స సత్యనారాయణ... పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులది త్యాగం తప్ప... అమరావతి రైతులు చేసింది త్యాగం ఎలా అవుతుందని ప్రశ్నించారు.