బుగ్గన.. ఆర్థిక మంత్రా.. అప్పుల మంత్రా?
ఏపీలో ఇప్పుడున్నది కేవలం అప్పుల శాఖా మంత్రి మాత్రమేనని అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు. 5 వ తేదీ వచ్చినా ఇంకా సగం మంది ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీ రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ది కోసం కొద్దిగా అప్పు చేసినా నానా యాగీ చేసిన ఇదే ఆర్థిక మంత్రి ఇప్పుడు నిస్సిగ్గుగా జగన్ చేయిస్తున్న లక్షల కోట్ల అప్పులను సమర్థిస్తున్నాడని అచ్చెన్నాయుడు అంటున్నారు.