అయ్యో.. అమితాబ్‌కు మళ్లీ కరోనా?

Chakravarthi Kalyan
బాలీవుడ్‌ నట దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ మళ్లీ కరోనా బారిన పడ్డారు. కరోనా రెండో సారి రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనను ఈ మధ్య కలిసిన వారు కరోనా పరీక్ష చేయించు కోవాలని అమితాబ్‌ బచ్చన్‌ సూచించారు. అమితాబ్‌కు కరోనా సోకిన విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నారు.

అమితాబ్‌ గతంలోనూ కరోనా బారిన పడ్డారు. 2020లో అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అంతా త్వరలోనే కోలుకున్నారు. అయితే అమితాబ్‌ కు మాత్రమే రెండోసారి కరోనా వచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌కు కరోనా రావడంతో ఆయన షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆయన కౌన్‌ బనేగా క్రోర్‌పతి కొత్త సీజన్‌ షూటింగ్‌లో నిన్న మొన్నటి వరకూ బిజీగా ఉన్నారు. అంతే కాదు.. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ నటిస్తున్న బ్రహ్మస్త్రలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: