గాంధీ సినిమా చూస్తూ.. గూండాగిరి చేసేశారు?

Chakravarthi Kalyan
దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం  గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తోంది. అన్ని థియేటర్లలో మార్నింగ్ షోలలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌ మల్లేపల్లిలోని ప్రియా థియేటర్‌లో గాంధీ సినిమాను చూసేందుకు వచ్చిన విద్యార్థులు థియేటర్ లో గూండాగిరీ చేయడం సంచనలంగా మారింది. మెహిదీపట్నంలోని ఎంఎస్ కాలేజీకి చెందిన 500 మంది విద్యార్థులు గాంధీ సినిమా చూస్తూ.. విధ్వంసం సృష్టించారు.

అహింస ప్రభోదించిన గాంధీ సినిమా చూస్తూ.. కొందరు విద్యార్థులు థియేటర్‌లో సీట్లు చించేశారు. తమ గూండాగిరి రికార్డు కాకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. థియేటర్ నిర్వాహకులు ఎంత మొత్తుకున్నా వారు కంట్రోల్‌ కాలేదు. చివరకు ప్రియా థియేటర్ మేనేజర్ మాజీద్ రజ్వీ పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. సినిమాలోని కొన్ని దృశ్యాల కారణంగానే విద్యార్థులు థియేటర్‌ను ధ్వంసం చేసినట్టు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: