బాబోయ్.. ఇక మరింతగా కరెంట్ వాతలా..?
ఈఆర్సీ వాటిపై 90 రోజుల్లోగా విచారణ జరిపి తుది ఆదేశాలిస్తుంది. ఇంతకాలం ఈ విచారణ గడువు 120 రోజులుండేది. దీన్ని 90కి తగ్గింస్తారు. కాలుష్యం తగ్గించాలనే లక్ష్యంతో సౌర, పవన, జలవిద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. ఈ ఇంధనాన్ని తప్పనిసరిగా డిస్కంలు నిర్ణీత శాతం కొనాల్సిందే. అలా కొనకపోతే డిస్కంలకు ఈఆర్సీ యూనిట్కు 35 నుంచి 50 పైసల చొప్పున జరిమానా వేస్తుంది. మరి ఈ కొత్త చట్ట సవరణ కరెంట్ చార్జీలు పెంచేస్తుందా.. తగ్గిస్తుందా.. చూడాలి.