ఆంధ్రా సెటిలర్స్ ఓట్లన్నీ ఆ పార్టీకే..?

Chakravarthi Kalyan
తెలంగాణలో ఆరా సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు పలు పార్టీలకు షాక్ ఇచ్చాయి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌ గెలుస్తందని ఆ పార్టీ చెప్పినా.. బీజేపీ కూడా దూసుకుపోతోందని ఆ సర్వే అంచనా వేసింది. టీఆర్ఎస్‌కే ఆధిక్యత వస్తుందని స్పష్టం చేసిన సర్వే సంస్థ నిర్వాహకులు మస్తాన్‌... ఆంధ్రా సెటిలర్స్ ఓట్ల విషయం కూడా వివరించారు.
ఆంధ్రాలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఆలోచన గురించి కూడా సర్వే చేశారు. ఆంధ్రా  సెటిలర్స్ ఎక్కువగా టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారట. ఇంకొందరు ఆంధ్రా సెటిలర్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారట. కానీ.. బీజేపీ వైపు మాత్రం ఆంధ్రా సెటిలర్స్ మొగ్గు చూపడం లేదట. ఇక హైదరాబాద్‌లో నివసిస్తున్న నార్త్ ఇండియన్స్ మాత్రం 80 శాతం బీజేపీ వైపే ఉన్నారట. తమ సంస్థ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందంటున్న ఆరా మస్తాన్‌.. ఇప్పటికీ తెలంగాణలో టీఆర్ఎస్‌దే ఆధిక్యమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: