జగన్ వచ్చాడు.. వెళ్లాడు.. ఏం ఒరిగింది..?
జీడిపల్లి, బిటిపి, పేరూరు హంద్రీనీవా పథకాల గురించి ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించలేదని కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. దేశంలో రైతు ఆత్మహత్యలు చేసుకోవడంలో ఆంధ్ర రాష్ట్రం 2 వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలు 3 వ స్థానం నిలిచిందని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఇందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనే కారణమని కాల్వ మండిపడ్డారు. అదే టీడీపీ హయాంలో రైతులకు రూ. 1126 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ అందించామన్నారు. రైతు సంక్షేమం కోసం టీడీపీ హయాంలో రూ. 11 వేల కోట్లతో రైతులకు డ్రిప్ పరికరాలు అందించామన్నారు.