కడప కుర్రాళ్లకు వైసీపీ గుడ్ న్యూస్‌?

Chakravarthi Kalyan
కడప యువతకు వైసీపీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.  ఈనెల 25న వై.ఎస్.ఆర్.జిల్లా చాపాడు సీబీఐటీ కళాశాలలో వైసీపీ మెగా జాబ్ మేళా నిర్వహించబోతోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కడప జిల్లాలోని  పది నియోజకవర్గాలకు సంబంధించిన నిరుద్యోగ యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని విజయసాయిరెడ్డి చెప్పారు.


ఈ మెగా జాబ్ మేళా పోస్టర్, వెబ్ సైట్ ను విజయసాయి రెడ్డి ప్రారంభించారు. సీఎం జగన్ సూచన మేరకు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహించామన్న విజయసాయి..  40 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. కడప జిల్లాలో కూడా ఈనెల 25న నిర్వహించే జాబ్ మేళాలో 100 ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చాయి. దాదాపు 10 వేల మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. జాబ్ మేళా నిర్వహణకు సీబీఐటీ ఛైర్మన్ జయచంద్రారెడ్డి ఉచితంగా వసతి కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: