శ్రీవేంకటేశ్వరుని వేషంలో వైసీపీ ఎంపీ..?

Chakravarthi Kalyan
తిరుపతి ఎంపీ గురుమూర్తి శ్రీవేంకటేశ్వరుని వేషంలో అదరగొట్టేశారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర వేడుకలకు ఆయన వెంకటేశ్వరుని వేషంలో హాజరయ్యారు. ఈ జాతరలో భాగంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి  వేంకటేశ్వరుడి వేష ధారణలో అమ్మవారిని దర్శించుకోవడం ఆశక్తి రేపింది. గంగమ్మ జాతర వేడుకల్లో తిరుపతి ప్రజలు ఒక్కొకరు ఒకొక్క వేషధారణ ధరించి అమ్మవారి దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది.

అందుకే ఈ జాతర సంప్రదాయాలను అనుసరించి తిరుపతి ఎంపీ గురుమూర్తి గోవిందుడి వేషధారణ ధరించారు. ఆయన తిరుపతి నగర పాలక సంస్థ నుండి కాలినడకన అమ్మవారి అలయానికి చేరుకున్నారు. అక్కడ గంగమ్మ ఆశీస్సులు అందుకున్నారు. దేవదేవుడు శ్రీనివాసుని వేషంలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎంపీ గురుమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మ అమ్మవారిని ప్రార్థించినట్టు గురుమూర్తి తెలిపారు. మొత్తానికి ఎంపీగారి వేంకటేశ్వరుని వేషం మాత్రం సూపర్‌ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: