శ్రీవేంకటేశ్వరుని వేషంలో వైసీపీ ఎంపీ..?
అందుకే ఈ జాతర సంప్రదాయాలను అనుసరించి తిరుపతి ఎంపీ గురుమూర్తి గోవిందుడి వేషధారణ ధరించారు. ఆయన తిరుపతి నగర పాలక సంస్థ నుండి కాలినడకన అమ్మవారి అలయానికి చేరుకున్నారు. అక్కడ గంగమ్మ ఆశీస్సులు అందుకున్నారు. దేవదేవుడు శ్రీనివాసుని వేషంలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎంపీ గురుమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మ అమ్మవారిని ప్రార్థించినట్టు గురుమూర్తి తెలిపారు. మొత్తానికి ఎంపీగారి వేంకటేశ్వరుని వేషం మాత్రం సూపర్ హిట్ అయ్యింది.