ఆ విషయంలో తెలంగాణ కంటే ఏపీ బెటరా?
రాష్ట్రంలో ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నామన్న సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తోన్న పథకాలతో పోల్చారు. ఏపీలో అమలు చేసినట్లుగా తెలంగాణ లోనూ నాడు నేడు పథకంలో ఇక్కడితో సమానంగా స్కూళ్లు అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. దీనికోసం ఏపీ కంటే తెలంగాణ రెండింతలు బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ ఎక్కడా దుర్వినియోగం చేయకుండా ప్రతి పైసా నిధులను సద్వినియోగం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.