లంచగొండి డాక్టర్‌కు షాకిచ్చిన విడదల రజని?

Chakravarthi Kalyan
పోస్ట్ మార్టం చేసేందుకు రూ.15 వేలు  డిమాండ్ చేసిన డాక్టర్ సంధాని బాషాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని విధుల నుండి తొలగించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయగిరి సిహెచ్ సీలో పని చేస్తున్న డాక్టర్ బాషా పోస్టు మార్టం కోసం డబ్బులు డిమాండ్ చేసిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. దీంతో నెల్లూరు డీసీహెచ్ఎస్ ప్రాథమిక దర్యాప్తు వివరాలను ప్రభుత్వానికి అందజేసింది. జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా డాక్టర్ బాషాను తక్షణమే విధుల నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ పూర్తి అయ్యేంత వరకూ  హెడ్ క్వార్టర్ ను వదిలి వెళ్లొద్దని డాక్టర్ బాషాను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి విడదల రజని స్పష్టం చేశారు.ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: