ఏపీ సీఎం జగన్ రోజుకు 36 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. వామ్మో.. ఒక్క రోజుకు అన్ని కోట్లు దేని కోసం అంటున్నారా.. ఏపీలో విద్యుత్ కొరత ఉన్న సంగతి తెలిసిందే. కానీ.. వినియోగదారులకు కరంట్ ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ భారీ ఎత్తున విద్యుత్ను కొనుగోలు చేస్తున్నారట. మార్చి నెలలో సగటున రోజుకు రూ.36.5 కోట్లు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశారు.అదే ఏప్రిల్లో సగటున రోజుకు రూ.34.08 కోట్లు వెచ్చించి కరెంటు కొన్నారు. అలాగే కరెంటు కోతలను అధిగమించడానికి మార్చి నెలలో మొత్తం 1268.69 మిలియన్ యూనిట్లు కొన్నారట. దీని కోసం రూ.1123.74 కోట్లు వెచ్చించారట. అదే ఏప్రిల్లో 1047 మిలియన్ యూనిట్లు రూ.1022 కోట్లు ఖర్చు చేసి కొన్నారట. అంతే కాదు.. ఇప్పుడే కాదు.. ఇక ముందు కూడా జగన్కు పరిస్థితి ఇలాగే ఉంటుందట.