గుడ్‌న్యూస్‌: వాళ్ల ఖాతాల్లో రూ.709 కోట్లు వేస్తున్న జగన్‌?

Chakravarthi Kalyan
ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇవాళ జగన్.. ఏపీలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మొత్తం 709 కోట్లు రూపాయలు వేస్తున్నారు. తిరుపతి నగరంలోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ఈ డబ్బులు వేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన సొమ్మును ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి సీఎం జగన్ తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్న సంగతి తెలిసిందే.  రాష్ట్రం ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోంది.  ఈ  జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి.. ఇప్పుడు డబ్బు వేస్తున్నారు. మొత్తం 709 కోట్ల రూపాయలు 10.85 లక్షల మంది తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం జగన్ టీటీడీ నిర్మించే పిల్లలు ఆసుపత్రికి భూమిపూజ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: