ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో లీకులు బాగా జరుగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ లీకుల వెనుక నారాయణ వంటి కార్పొరేట్ స్కూళ్ల హస్తం ఉందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తొలిరోజే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారట. తిరుపతి నారాయణ వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్ రెడ్డి ఏకంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి వాట్సప్లో పేపర్ తెప్పించుకున్నారట. చిత్తూరులో ఇన్విజిలేటర్గా పనిచేస్తున్న ఓ గవర్నమెంట్ టీచర్ ని ప్రలోభపెట్టి పేపరు తెప్పించుకున్నాట. దాన్ని నారాయణ, మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థల అధికారులు, సిబ్బందికి పంపారట. ఈ కేసులో గిరిధర్తో పాటు చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఆరీఫ్, డీన్ కె.మోహన్, తిరుపతి ఎన్ఆర్ఐ అకాడెమీ ఉపాధ్యాయుడు కె.సుధాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ పి.సురేష్, ప్రభుత్వ ఉపాధ్యాయులు పవన్, సోములను పోలీసులు అరెస్టు చేశారు.