ఏపీలో పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు బాగా లీకవుతున్నాయి. అయితే.. ఈ లీకుల వెనుక అక్కడక్కడా టీడీపీ నేతల హస్తం ఉందంటోంది ప్రభుత్వం.. అనడం కాదు.. అందుకు రుజువులు చూపిస్తూ టీడీపీ కార్యకర్తలను అరెస్టు కూడా చేయించింది. శ్రీకాకుళం జిల్లా రొట్టవలస, కొత్తపేట జెడ్పీ హైస్కూళ్లలో హిందీ ప్రశ్నాపతాన్ని టీడీపీ నేతలే లీక్ చేశారట. దాన్ని వాట్సాప్లో వైరల్ చేశారట. ఈ ఘటనలై దర్యాప్తు చేసిన పోలీసులు టీడీపీ నేతల ప్రమేయం చూసి ఆశ్చర్యపోయారట. ఏడుగురు టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేశారట. ఈ ఘటనలను చూపి.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ ఇలా దిగజారిందంటున్నారు వైసీపీ నేతలు. గతంలో రాష్ట్రం డ్రగ్స్ మయమైపోయిందని ప్రచారం చేశారని.. గంజాయి పెరిగిపోయిందని ఇలాగే ప్రచారాలు చేశారని గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం తమ్ముళ్లు అత్యాచారాలు చేస్తే లోకేశ్ వాటిని ప్రభుత్వానికి అంటగడుతున్నారని విమర్శిస్తున్నారు.