ఆవిడేం హోంమంత్రి? నారా లోకేశ్ సెటైర్లు?

Chakravarthi Kalyan
ఏపీలో గత నాలుగైదు రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా అత్యాచారం, దాని ఫాలో అప్ వార్తలే కనిపిస్తున్నాయి. రేపల్లె రేప్, విజయవాడ రేప్, దుగ్గిరాల రేప్.. ఇలా అన్నీ రేపుల వార్తలే.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ వాయిస్ పెంచింది. కొన్నిరోజుగా  ఏపీలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయి 1000 రోజులు అయితే 800 మంది పైన అత్యాచారాలు జరిగాయన్నారు.


అంతే కాదు..  హోం మంత్రికి అత్యాచార ఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలియని పరిస్థిలో ఉన్నారని నారా లోకేశ్ విమర్శించారు. ఇలాంటి అఘాయిత్యాలకు కారణం వైసీపీ నాయకులే అని నారా లోకేశ్ అన్నారు. బాధిత కుటుంబానికి పరామర్శించడానికి వెళితే కేసులు పెడుతున్నారని నారా లోకేశ్  మండిపడ్డారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే అడ్డుకున్నారని.. నారా లోకేశ్  అన్నారు. తాము గట్టిగా పొరాడం చేయడం వలనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: