కరోనా ఫోర్త్‌ వేవ్‌పై ఆ మంత్రి షాకింగ్ కామెంట్స్?

Chakravarthi Kalyan
కరోనా ఫోర్త్‌ వేవ్‌ వస్తుందని ఎప్పుడో చెప్పినా..ఇంకా ఇండియాలో దాని జాడ లేదు. అయితే కరోనా నాలుగో దశ గురించి కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ షాకింగ్ కామెంట్‌ చేశారు. కరోనా నాలుగో దశ జూన్‌ తర్వాత గరిష్ఠస్థాయికి చేరుకుంటుందట. అలాగే అక్టోబర్‌ వరకు దాని ప్రభావం ఉంటుందని కాన్పూర్‌ ఐఐటీ నిపుణులు అంచనా వేసినట్టు కర్ణాటక మంత్రి సుధాకర్ తెలిపారు. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్‌ ధరించడం వంటి ముందు జాగ్రత్తలు పాటిస్తూనే కరోనా వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని కర్ణాటక మంత్రి సుధాకర్ సూచించారు. గత మూడు కరోనా దశలలో ఐఐటీ కాన్పుర్‌ పరిశోధకుల బృందం వేసిన అంచనాలు కచ్చితంగా ఉన్నాయంటున్నారు కర్ణాటక మంత్రి సుధాకర్. అందుకే వారు శాస్త్రీయ సమాచారం ఆధారంగా వారు రూపొందించిన తాజా నివేదికను తాను నమ్ముతున్నానంటున్నారు. ఈ నివేదికలోని విషయాలు నిజమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అని కర్ణాటక మంత్రి సుధాకర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: