లేడీ జర్నలిస్టుల వర్క్ షాప్ ఫస్ట్డే అదుర్స్!
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతంగా జరిగింది. ఉదయం మొదటి సెషన్ లో మహిళా జర్నలిస్టుల అభ్యున్నతికి తమవంతు సహకారాన్ని అందిస్తామని ముఖ్య అతిథులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి - సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి - సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ - గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ - సునీతా లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.
రెండో సెషన్ లో మహిళల అస్థిత్వం : లింగ వివక్ష మీడియా ధోరణుల అంశంపై చర్చ జరిగింది. ఎట్లా ఆలోచించాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనే స్పష్టతనిస్తూ ప్రొఫెసర్ విమల కొల్లాపూర్ స్ఫూర్తి నింపారు. మీడియాలో కొరవడుతున్న మహిళల ప్రాతినిధ్యం : వార్తలు - సమస్యల కొరత అంశంపై ప్రొఫెసర్. పద్మజా షా గారి ప్రసంగం వాస్తవాలను కళ్ళకు కట్టింది. తెలంగాణ మహిళా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లేలా ఈ రోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఇదే ఉత్సాహంతో రేపటి కార్యక్రమాలు కూడా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు.