సతీసమేతంగా ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకంటే?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం కేసీఆర్.. మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఆయన ఈసారి సతీ సమేతంగా ఢిల్లీకి వెళ్లారు. సీఎం కేసీఆర్ మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. ప్రధానంగా కేసీఆర్, ఆయన సతీమణి ఆరోగ్య పరీక్షలు చేయించుకోనున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ పలుసార్లు కేసీఆర్ దంపతులు దిల్లీకి వైద్యం కోసం వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఇవి కాకుండా.. సీఎం కేసీఆర్ ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం వస్తోంది. అయితే ఇది ఇంకా ధ్రువీకరణ కాలేదు. ఈనెల 11న తెలంగాణ భవన్ వేదికగా ధాన్యం పై ధర్నా నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింి. ఈ కార్యక్రమం కూడా ఢిల్లీలోనే  ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న మొన్నటి వరకూ కేంద్రంపై నిప్పులు చెరిగిన కేసీఆర్... ఇప్పుడు స్వయంగా పీఎం అపాయింట్‌మెంట్ కోరడం కూడా ఆసక్తి రేపుతోంది. మరి ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలుస్తారా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: