విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం షాక్?

Chakravarthi Kalyan
విశాక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామంటూ గతంలో ప్రకటించిన కేంద్రం ఆ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగుతోంది. విజయవాడ- విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కోసం ప్రత్యేకాధికారి నియామకం జరిగినట్టు తాజాగా రైల్వే శాఖ తెలిపింది. నూతన జోన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళిక, ముందస్తు కార్యాచరణ కోసం ఓఎస్డీ పనిచేస్తున్నారని తెలిపిన రైల్వే బోర్డు..   విశాఖ రైల్వే జోన్ పై సమాచార హక్కు చట్టం కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారానికి  జవాబిచ్చింది.


సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ,రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం డీపీఆర్ ల రూపకల్పన ఇంకా అధ్యయనంలో ఉన్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. కొత్త జోన్ కార్యకలాపాల కోసం ఎలాంటి నిర్ధిష్టమైన గడువునూ విధించలేదని తెలిపిన రైల్వేశాఖ... తూర్పుకోస్తా రైల్వే లో కొత్త జోన్ ఏర్పాటు, రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం 2020-21, 2021-22, 2022-23 ఆర్ధిక సంవత్సరాలకు 170 కోట్లు కేటాయించినట్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ కొత్త జోన్, డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి వ్యయం చేయలేదని తెలిపింది. రాయగడ రైల్వే డివిజన్.. తూర్పుకోస్తా రైల్వే జోన్ లోనే కొనసాగుతుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: