ఉక్రెయన్‌ నుంచి ఇప్పటి వరకు ఇండియాకు 18 వేల మంది..?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని ఇండియన్లు ఇండియాకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ను వీడినట్టు విదేశాంగశాఖ  ప్రకటించింది. వీరిలో 6,400 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చారని ఆ శాఖ తెలిపింది. 'ఆపరేషన్ గంగ'లో భాగంగా 30 విమాన సర్వీసులు నడుపుతున్నామని ప్రకటించిన విదేశాంగశాఖ ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి భారతీయుల తరలిస్తున్నామని తెలిపింది.

మరో 24 గంటల్లో 18 విమానాలు భారత్‌కు చేరతాయని విదేశాంగ శాఖ తెలిపింది. దీని ద్వారా 2,3 రోజుల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు స్వదేశానికి వస్తారని ఈ విదేశాంగ శాఖ తెలిపింది. నిన్న కూడా  పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఖార్కివ్‌ను వీడారని.. అసలు మొత్తం ఉక్రెయిన్‌లో 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. ఉక్రెయిన్, రష్యాతో వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: