వారి బాధ్యత నాదే: వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన?
తాజాగా ఈ కార్యక్రమం ముగించిన ఎమ్మెల్యే.. పార్టీ కార్యకర్తలు, నాయకుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఈ యాత్ర చేశానన్నారు. 65 రోజల్లో 5,019 మంది కార్యకర్తల ఇళ్లకి వెళ్లానని ఆయన తెలిపారు. వారిలో 1,072 మంది పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని కోటంరెడ్డి అన్నారు. ఆ కుటుంబాలకు చెందిన 400 మంది విద్యార్థుల చదువుల బాధ్యత తానే భరిస్తానన్నారు. ఆ విద్యార్థులుప్రయోజకులయ్యేంత వరకు వారి బాధ్యత తనదేనన్నారు. మరో 672 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తానన్నారు.