రండి బాబూ.. రండి: ఉద్యోగ సంఘాలకు ఏపీ ఆహ్వానం..?

Chakravarthi Kalyan
ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన ఏపీ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. పీఆర్సీ అంశంపై చర్చించేందుకు రావాలంటూ ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రుల కమిటీ తో చర్చలకు రావాల్సిందిగా పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీని ఆహ్వానిస్తూ... సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సమాచారం పంపారు.  

సచివాలయంలోని రెండో బ్లాక్ ఆర్ధిక శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా స్టీరింగ్ కమిటీకి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే చర్చలకు రావాలని నిన్నకూడా ఆహ్వానించినా ఉద్యోగ సంఘాలు పట్టించుకోలేదు. నిన్న చాలా సేపు మంత్రులు ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని ఎదురు చూసి వెళ్లిపోయారు. నేరుగా సీఎంతోనే చర్చలకు వస్తామంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. మరి ఇవాళైనా ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తారా.. లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: