నేడు సినిమా థియేటర్ల యాజమాన్యాల భేటీ.. ఎందుకంటే..?
ముఖ్యంగా టికెట్ల ధరలు తగ్గించడంతో.. థియేటర్లతో పాటు ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలపై ఇవాళ రాజమండ్రిలో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా. భారీ బడ్జెట్తో ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు రాధేశ్యామ్ వంటి మరికొన్ని సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సినిమా టికెట్ ధరలపై ఇప్పటికే హై కోర్టు విచారణ చేపడుతుంది. ఇవాళ సినిమా టికెట్ల ధరలపై ఏపీ హై కోర్టు మరొకసారి విచారణ చేపట్టనున్నది. ఓ వైపు హై కోర్టు తీర్పు ఈ విధంగా ఉంటుందని.. ఈ భేటీలో ఏమి చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది.