బిగ్ బ్రేకింగ్ : ఉద్రిక్తత... మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు బైఠాయింపు


 మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ను అడ్డుకునేందుకు అధికార వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. విజయనగం జిల్లా మేడికొండ లోని కోదండ రామస్వామి ఆలయం పునర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిపే కార్యక్రమానికి అనువంశీక ధర్మకర్త అయిన అశోక్ గజపతి రాజును ఆహ్వానించ లేదు. బుధవారం శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్,  బి. సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అశోక్ గజపతి రాజు తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. వీరిని అధికారులు  అడ్డుకున్నారు. దీంతో అశోక్ గజపతి రాజు అగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, ధర్మకర్తకు తెలియకుండా శంకుస్థాపన ఏంటి ? అని అధికారులను ప్రశ్నించారు.  వై.ఎస్.అర్ కాంగ్రస్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అరుపులతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. ఆ తరువాత అశోక్ గజపతి రాజు శంకుస్థాపన శిలా ఫలకాలను తోసివేసి అక్కడే బైఠాయించారు. దేవాదాయ శాఖ నిబంధనలు పాటించక పోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: