నిజామాబాద్ లోకల్బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రచ్చ..!
దీనికి సంబంధించి నందిపేట్ నవణీత, నిజామాబాద్ సిటీలోని 31 డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ గజియా సుల్తానా తన ఫోర్జరీ సంతకాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ నామినేషన్ విషయంలో ఒకవేళ వారిద్దరి సంతకాలు ఫోర్జరీ అని తేలితే మాత్రం శ్రీనివాస్ నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తారు. కేవలం కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అవుతారు. ఇంతకు అసలు ఫోర్జరీ జరిగిందా లేదా..? ఇంతా రచ్చ తర్వాత శ్రీనివాస్ అసలు బరిలో ఉంటాడా..? లేక తప్పుకుంటాడా అనే విషయం మరికొద్ది సేపట్లో తేలియనుంది.