చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..రెండు రోజులు స్కూళ్లు బంద్

N ANJANEYULU
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వ‌ర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇవాళ తెల్ల‌వారు జామున నుంచి తిరుప‌తిలో భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది. తిరుప‌తిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మాధవ నగర్, గొల్లవానిగుంట, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఇండ్ల‌లోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెస్ట్ చర్చి, తూర్పు పోలీస్ స్టేషన్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జిల కింద భారీగా చేరింది వర్షపు నీరు. అదేవిధంగా కరకంబాడి మార్గంలో కూడా భారీగా వరద నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలన్ని నిలిచిపోయాయి.

ముఖ్యంగా  మ‌ధురాన‌గ‌ర్‌లో 5 అడుగుల మేర నీటి ప్ర‌వాహం ఉంది.  ప్ర‌ధాన రోడ్ల‌లో మూడు అడుగుల వ‌ర‌కు నీటి ప్ర‌వాహం కొన‌సాగుతొంది. ఎక్క‌డిక‌క్క‌డ వాహ‌నాలు నిలిచిపోయాయని, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌టికి రావొద్ద‌ని  ఎస్పీ సూచించారు.  వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండడంతో చిత్తూరు జిల్లాలో పాఠశాలలకు శుక్ర‌వారం, శ‌నివారం రెండు పాటు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హరినారాయణన్ ప్ర‌క‌టించారు.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని  స్పష్టం చేశారు క‌లెక్ట‌ర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: