కృష్ణా జిల్లాలో మంత్రి గారి కొడుకు హడావుడి...?
ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ ఎం వై దానం అతిథిగా హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేకపోవడంతో కిట్టు ను ఆహ్వానించినట్లు ఆర్టీసి అధికారులు చెప్తున్నారు. గతంలో మచిలీపట్నం కార్పొరేషన్ అధికారులు సమీక్షకు కూడా కృష్ణ మూర్తి హాజరు కావడం వివాదాస్పదం అయింది. అధికారిక కార్యక్రమాలు కు మంత్రి నాని.. తన కుమారుడిని పంపడం పై చర్చ జరుగుతుంది.