చార్ధామ్ యాత్రలో సమంత.. సోషల్ మీడియాలో ఫోటోలు..!
యమునోత్రి నుంచి ప్రారంభమైన యాత్ర గంగోత్రి మీదుగా కేదరినాథ్, బద్రీనాథ్ వరకు యాత్ర కొనసాగుతుంది. చార్ధామ్ యాత్రలో భాగంగా హెలికాప్టర్ ల్యాండ్ అయిన తరువాత స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఫోటో దిగింది సమంత. ఆమె గులాబీ రంగు పంజాబీ డ్రెస్లో సరికొత్తగా కనిపిస్తోంది. నాగచైతన్యతో విడాకుల తరువాత మనోవేదనకు గురైన సమంత ప్రశాంత జీవితాన్ని గడిపేందుకు చార్ధామ్ యాత్రకు వెళ్లింది. గతం మరిచిపోయి తన కేరీర్పై దృష్టి సారించాలని ప్లాన్ చేసుకోంటుంది. ఇప్పటికే సమంత నటిస్తున్న శాకుంతలం చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకున్నది. శాకుంతలంతో పాటు కాతువాకుల రెండు కాధల్ చిత్రాలలో నటిస్తుంది.