చార్‌ధామ్ యాత్ర‌లో స‌మంత‌.. సోష‌ల్ మీడియాలో ఫోటోలు..!

N ANJANEYULU
ఇటీవ‌ల విడాకుల గురించి ప్ర‌క‌టించి నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స‌మంత తాజాగా కొన్ని ఫోటోలు విడుద‌ల చేసింది.  ఉత్త‌ర‌ఖండ్ యాత్ర‌కు సంబంధించినవిగా తెలుస్తోంది. ఇప్ప‌టికే స‌మంత రిషికేశ్‌లో ఓ ఆశ్ర‌మానికి వెళ్లిన సంద‌ర్భంగా తీసిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన విష‌యం విధిత‌మే. తాజాగా త‌న స్నేహితురాలు శిల్పారెడ్డితో క‌లిసి  స‌మంత చార్‌ధామ్ యాత్ర‌కు వెళ్లింది. ఈ ఫోటోలు షేర్ చేసిన త‌రుణంలో ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి.
య‌మునోత్రి నుంచి ప్రారంభ‌మైన యాత్ర గంగోత్రి మీదుగా కేద‌రినాథ్‌, బ‌ద్రీనాథ్ వ‌ర‌కు యాత్ర కొన‌సాగుతుంది. చార్‌ధామ్ యాత్ర‌లో భాగంగా హెలికాప్ట‌ర్ ల్యాండ్ అయిన త‌రువాత స్నేహితురాలు శిల్పారెడ్డితో క‌లిసి ఫోటో దిగింది స‌మంత‌. ఆమె గులాబీ రంగు పంజాబీ డ్రెస్‌లో స‌రికొత్త‌గా క‌నిపిస్తోంది. నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌రువాత మ‌నోవేద‌న‌కు గురైన స‌మంత ప్ర‌శాంత జీవితాన్ని గ‌డిపేందుకు  చార్‌ధామ్ యాత్ర‌కు వెళ్లింది. గ‌తం మ‌రిచిపోయి త‌న కేరీర్‌పై దృష్టి సారించాల‌ని ప్లాన్ చేసుకోంటుంది. ఇప్ప‌టికే స‌మంత న‌టిస్తున్న‌ శాకుంత‌లం చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న‌ది. శాకుంత‌లంతో పాటు కాతువాకుల రెండు కాధ‌ల్ చిత్రాల‌లో న‌టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: