యాదాద్రి పునఃప్రారంభంపై ఓ కొలిక్కి వచ్చింది. ఎప్పటి నుంచో భక్తులు ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ మంగళవారం యాదాద్రిని సందర్శించి విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణలో యాదాద్రి పుణ్యక్షేత్రం గొప్పగా తీర్చిదిద్దుతున్నాం. గతంలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వలేదు. యాదాద్రిలో 15 కిలోమీటర్ల వరకు ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ భక్తులను ఆకట్టుకునేలా రెండు కోట్లతో విలాసవంతమైన కాటేజ్ నిర్మిస్తాం. ఒక్కో కాటేజ్ 1000 గజాల వరకు ఉంటుంది. చాలా మంది ధాతలు ముందుకు వస్తున్నారు. కేసీఆర్ ఆలయానికి 16 తులాల బంగారాన్ని అందజేయనున్నారు. బస్టాండ్ నుంచి గుట్టపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు సీఎం తెలిపారు. బస్సుల కొనుగోలు త్వరలో జరుగుతుందని వెల్లడించారు.
ఆలయానికి విమాన గోపురం కోసం బంగారం తాపడానికి 125 కిలోల బంగారం అవసరం అవుతుందని..రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామాన్ని భాగస్వామ్యం చేస్తాం అని తెలిపారు. కేసీఆర్ కుటుంబం 16 తులాలు సమకూర్చుతుందని వెల్లడించారు. అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి 1 కేజీ, ఎమ్మెల్యే జనార్థన్రెడ్డి 1 కిలో, చినజీయర్ స్వామి 1 కిలో చొప్పున ఇలా చాలా మంది దాతలు ముందుకొచ్చి ప్రకటించడం సంతోషకరం అన్నారు. సుమారు 8 వేల మంది రుత్వికులతో మార్చి 21 2022న మహా సుదర్శన యాగం చేపడుతున్నట్టు తెలిపారు.