కియా పరిశ్రమలో కలకలం!

Chaganti
అనంతపురం కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ సంచలనంగా మారింది, ఇనుప రాడ్లతో జూనియర్, సీనియర్ ఉద్యోగులు దాడి చేసుకున్న విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ప్రధాన ప్లాంట్లో హుండాయ్, ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. ఉద్యోగులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నా... కియా పరిశ్రమ ప్రతినిధులు పట్టించుకోకపోవడం పై మిగతా ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఉద్యోగుల మధ్య ఘర్షణ ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందన్న భయంతో ఇతర ఉద్యోగులు ఉన్నారని అంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో... కియా కంపెనీ... తమిళనాడుకు తరలిపోతుందని, ఈ దిశగా చర్చలు జరుపుతోంది అని ప్రముఖ రాయిటర్స్ వార్త సంస్థ ఓ కథనం ఇవ్వడం అప్పట్లో కలకలం రేగింది, అయితే అలాంటి ఉద్దేశం ఏమీ లేదని... తాము మరింత ఎక్కువ ఉత్పత్తి చేపట్టే దిశగా ప్లాన్స్ ఉన్నామని కియా అప్పట్లో తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

kia

సంబంధిత వార్తలు: