అశ్లీల కేసులో రాజ్ కుంద్రాకు బెయిల్ లభించింది, 50 వేల పూచీకత్తుపై మేజిస్ట్రేట్ కోర్టు రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేసింది. రాజ్ కుంద్రా అసభ్యకరమైన కంటెంట్ను సృష్టించి దానిని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లపై విడుదల చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతనితో పాటు ఇంకా చాలా మందిని అరెస్టు చేశారు, ఈ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత జూలై 19 న రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. అతని తర్వాత, ఈ విషయంలో శిల్పా శెట్టిని కూడా ప్రశ్నించారు. తరువాత ఆమె రాజ్ కుంద్రా విషయంలో కోపంగా ఉందని ఆమె ఆయనతో విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరగగా అదేమీ లేదని హింట్ ఇచ్చే విధంగా ఇప్పుడు ఆమెకు బెయిల్ లభించింది, శిల్పా సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్ట్ను షేర్ చేసింది, శిల్పా శెట్టి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సాయంత్రం ఆకాశంలో ఇంద్రధనస్సు చిత్రాన్ని పంచుకున్నారు మరియు శీర్షికలో, చెడు తుఫాను తర్వాత కూడా అందమైన విషయాలు జరగవచ్చని చూపించడానికి రెయిన్బో ఉనికిలో ఉంది అంటూ తమకు మంచి రోజులు రానున్నాయనే విషయాన్ని చెప్పుకొచ్చింది.
మరింత సమాచారం తెలుసుకోండి: