శ్రీలంక క్రికెట్ జట్టు లెజెండరీ క్రికెటర్ ఇంకా యార్కర్ అయిన కింగ్ లసిత్ మలింగ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు ముగింపుని పలికాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తన సోషల్ మీడియా ద్వారా లసిత్ మలింగ్ స్పష్టం చేయడం జరిగింది.తాను క్రికెట్ ఆడకున్నా కాని ఆట పై ప్రేమ అలాగే ఉంటుందని లసిత్ మలింగ తెలిపాడు.క్రికెట్ ని ఆడకున్నా కాని ఆ ఆట కోసం మరింత కృషి చేస్తానని ప్రకటించడం జరిగింది.
17 సంవత్సరాల క్రికెట్ ఎక్స్పీరియన్స్ తో కుర్ర క్రికెటర్ల కు మంచి మంచి పాఠాలు చెబుతానని స్పష్టం చేశాడు లసిత్ మలింగ. ఇక లసిత్ మలింగ తన ఇంటర్నేషనల్ క్రికెట్ హిస్టరీలో ఇప్పటి వరకు కూడా ఏకంగా మొత్తం 30 టెస్ట్ లు, 226 వన్డేలు, 83 టీ 20 మ్యాచ్ లు ఇంకా 122 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు ఆడటం జరిగింది. ఇక అంతే కాదు లసిత్ మలింగ ఇప్పటి వరకు కూడా 500 పైగా వికెట్లు పడగొట్టాడు.