నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను ఆటోలో తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళను ఆటో డ్రైవర్ బాలాజీ తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి మృతదేహాన్ని గుండారం చెరువులో పడేశాడు. అంతేకాకుండా మహిళ పై ఉన్న బంగారాన్ని నింధితుడు దోచుకున్నట్టు తెలుస్తోంది. నింధితుడికి మరో యువకుడు ఆకాష్ సహాయం చేశాడు. హత్య చేసిన అనంతరం నింధితులు పరారయ్యారు .
అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేందుకు వచ్చిన మహిళ తిరిగి ఇంటికి వెళుతుండగా ఆటో ఎక్కింది. డ్రైవర్ దారి మల్లించి మహిళను తీసకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గుండారం చెరువులో మహిళ మృతదేహం లభించగా పోలీసులు విచారణ చెపట్టారు. నింధితులు ఆటో డ్రైవర్ బాలాజీ, ఆకాష్ లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు .