రాత్రుళ్ళు కూడా సీబీఐ ఆన్ డ్యూటీ!
ఇక తాజాగా వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ రాత్రంతా జరిగింది. పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కొనసాగిన ఈ విచారణలో ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా సీబీఐ భావిస్తున్న వివేకా సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, వివేకా పిఎ క్రిష్ణా రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, కిరణ్ కుమార్ యాదవ్, సునీల్, వివేకా మాజీ డ్రైవర్ ప్రసాద్ లు కూడా విచారణకు హాజరయ్యారు.