మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి సంధర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుని నివాళులు ఆర్పిస్తున్నారు. కాగా తెలుగు తేజానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా సోషల్ మీడియా వేధికగా నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో. ..భారత మాజీ ప్రధానమంత్రి, రాజనీతిజ్ఞుడు, క్రాంతదర్శి , విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అయిన శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానంటూ పేర్కొన్నారు . స్వావలంబన , స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తూ దేశ భవిష్యత్తుకు బాటలు పరచిన పీవీ గారు మాతృభాషకు సైతం అంతే ప్రాధాన్యతనిచ్చారని గుర్తు చేశారు . విశాల దృష్టితో వీక్షించి , దేశానికి వారు అందించిన సేవలను జాతి యావత్తు చిరకాలం గుర్తు పెట్టుకుంటుందంటూ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు .