ఏపీలో గ్రూప్ 1 అభ్యర్థుల పరీక్షల కేసు తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది.అభ్యర్థుల మెయిన్స్ పేపర్ కరెక్షన్ ప్రైవేట్ ఏజన్సీ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన వారు చేయాల్సిన పనిని ప్రవేట్ సంస్థ అయిన టీసీఎస్ చేయడం సరికాదని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు.ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది.