తెలంగాణలో భూముల అమ్మకాన్నిమాజీ ఎంపీ,బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా వ్యతిరేకించారు.భూముల అమ్మకం పై ఆర్థికమంత్రి హరీష్ రావు వాదన చాలా అసంబద్ధంగా ఉందన్నారు. గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోవాలన్నారు. మరి, ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఇప్పటి తెలంగాణలో ఈ భూముల అమ్మకాలు, వేలాలు ఏంటి అంటూ ఆమె ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశామని సీఎం కేసీఆర్ ఒప్పుకుని ప్రజలందరికి క్షమాపణ చెప్పి తీరాలని విజయశాంతి డిమాండ్ చేశారు.భూముల అమ్మకం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. డబ్బులు లేక భూములు అమ్ముకాడికి వచ్చిన సీఎం...కార్లు పంపిణీ చేయడం, కోట్ల రూపాయలతో పబ్లిసిటీ చేసుకోవడం,కొత్తసెక్రటేరియట్ ఎందుకంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.