పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు మిస్సింగ్ సస్పెన్స్ కు తెర పడింది. పుట్టా మధును భీమవరంలో ఓ హోటల్లో రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే మధు కనిపించకుండా పోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే.