భారత్ కు భరోసా.. భారీ సాయం చేస్తున్న ఆ దేశం..!!

Madhuri
దేశంలో క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరో వైపు పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మ‌హ‌మ్మారి కొత్త‌రూపం దాల్చ‌డంతో దేశంలో మ‌ర‌ణాలు స‌రికొత్త రికార్డు స్థాయికి చేరాయి.  దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 4,12,784 మంది క‌రోనాబారిన‌ప‌డ్డారు. ఇండియాలో క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇంత భారీ సంఖ్య‌లో న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. కాగా, మ‌ర‌ణాలు నాలుగు వేల‌కు ద‌గ్గ‌ర‌గా రికార్డ‌య్యాయి.  24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.
ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ రష్యా మరోసారి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను పంపనుంది. మరో రెండ్రోజుల్లో లక్షాల 50వేల డోసులు ఇండియాకు చేరుకోనున్నాయి. హైదరాబాద్ కు మరో 3మిలియన్ డోసులు రాబోతున్నాయి. వీటితో పాటు వచ్చే నెల ఐదు మిలియన్లు, జులైలో 10మిలియన్ వ్యాక్సిన్లు రానున్నాయి. అంతేకాకుండా.. నాలుగు మీడియా ఆక్సిజన్ జనరేటింగ్ ట్రక్స్ ను రష్యా పంపించనుంది. అవి దాదాపు 200 హాస్పిటల్ బెడ్స్ కు సరిపోతాయని.. ఈ ట్రక్కులు వారం చివరి నాటికి రష్యన్ IL-76 సాయంతో ఇండియాకు చేరుకుంటాయని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: