దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఆయన ఏకంగా మూడు కీలకమైన సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు కొవిడ్ సంబంధిత ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష, 10 గంటలకు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్, 11.30గంటలకు దేశీయ ప్రముఖ ఆక్సిజన్ తయారీదారులతో సమావేశం అవుతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం సైతం ఆక్సిజన్ సంక్షోభంపై ప్రధాని సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.