టెన్ష‌న్‌: చంద్రబాబు సోదరి హైమావతి ఇంటికి పోలీసులు

VUYYURU SUBHASH
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోదరి హైమావతి ఇంటికి పోలీసులు వచ్చి ఫొటోలు తీయడం కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి పోలీసులమని కాపలాదారుకు చెప్పి లోపలికి వెళ్లారు. అయితే, ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉండడంతో మళ్లీ బయటకు వచ్చి పరిసరాలను ఫొటోలు తీశారు.

దీనిపై సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యంగా హైమావ‌తి ఇంటి వాచ్‌మెన్ ర‌వి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ రామచంద్రారెడ్డి వివరణ ఇస్తూ.. నారావారిపల్లెలోని చదలవాడ సుచరిత ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిన‌ట్టు త‌మ‌కు స‌మాచారం అందింద‌ని.. అయితే సిబ్బంది పొర‌పాటుగా నారావారిపల్లెకు కాకుండా కందులవారి పల్లెకు వెళ్లారని అన్నారు. హైమావతి కుమార్తె పేరు కూడా సుచరిత కావడంతో ఆమె ఇంటికి వెళ్లారని సీఐ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: