చల‌సాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మ‌హ‌త్య వెన‌క ఎన్నెన్నో సందేహాలు

VUYYURU SUBHASH
ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్యకు పాల్పడడం విషాదం నింపింది. గ‌త రాత్రి ఆమె భ‌ర్త ఇంటికి వ‌చ్చే స‌రికే ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. ఆమె హైద‌రాబాద్‌లో ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ గా ప‌ని చేస్తున్నారు. ఓయూ కాల‌నీలో ఓ విల్లాలో నివాసం ఉండే ఆమె గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌ను 2016లో వివాహం చేసుకున్నారు. పెళ్ల‌య్యి నాలుగు ఏళ్లు అవుతున్నా సంతానం లేక‌పోవ‌డంతోనే ఆమె డిప్రెష‌న్లో ఉన్నార‌ని అంటున్నారు.

సంతానం లేకపోవడంతో కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు ఇదే కార‌ణ‌మ‌ని కుటుంబ స‌భ్యులు చెపుతున్నా చాలా సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: