హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపెట్టె దొరకలే !

దుబ్బాక ఉపఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తోన్న బండి సంజయ్ హరీష్ రావు మీద సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు గాని అగ్గిపెట్టే దొరకలేదని అన్నారు. శ్రీకాంతాచారి అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడయితే టీఆర్ఎస్ ఆయన చావుని వాడుకుందని అన్నారు. మీటర్లు టీ ఆర్ ఎస్ నాయకులు కు పెడతామన్న ఆయన ఉచిత కరెంట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సన్న బియ్యం రైతులు రేటు లేక తగల పెట్టుకుంటున్నారని అన్నారు.
బీజేపీ గెలిస్తే మల్లన్న సాగర్ నిర్వాసితులను తీసుకుని వెళ్లి వారం రోజుల్లో ప్రగతి భవన్ ముందు కూర్చుంటామని అన్నారు. కరీంనగర్ ఫలితమే దుబ్బాక లో వస్తుందన్న ఆయన 1500 కోట్లతో రెండు లక్షలు ఇళ్ళు ఇచ్చామని అన్నారు. పింఛన్లు విషయం లో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాక వైపు రాష్ట్రమంతా చూస్తుందన్న ఆయన బూట్ పాలిష్ నాయకులు సవాళ్ల కి నేను స్పందించను, సీఎం రావాలని అన్నారు. బీజేపీ ని కాదు, ప్రజా స్వామ్యాన్ని గెలిపించండని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: