యువకులను అందుకే టీంలో తీసుకోలేదు: ధోనీ

ఐపిఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ కి పేరున్న సంగతి తెలిసిందే. ఐపిఎల్ లో ఏ జట్టు కూడా అన్ని విజయాలను నమోదు చేయలేదు. కెప్టెన్ గా ధోని ఉండటం ఆ జట్టుకి ప్రధానంగా కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి. ధోని జట్టుని నడిపించే విధానం, ఆ జట్టులో ఉన్న ఆటగాళ్ళ ప్రదర్శన అన్నీ కూడా కలిసి వచ్చాయి. అయితే ఈ ఏడాది టోర్నీ లో మాత్రం ఆశించిన స్థాయిలో చెన్నై ఆకట్టుకోలేదు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా జరిగిన మ్యాచ్ తర్వాత ధోనీ మాట్లాడుతూ... మా జట్టులో ఉన్న యువకుల్లో స్పార్క్ కనపడలేదు అని అందుకే వారికి అవకాశం ఇవ్వలేదు అని,   కీలక దశలో విజయం కోసం వారిని రంగంలోకి దించాలని ఆపినట్టుగా చెప్పాడు. సిఎస్‌కె సోమవారం ఆర్‌ఆర్‌ పై 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: