హైవేపై బోల్తాపడిన ట్రక్.. పండగ చేసుకుంటున్న జనాలు..?
చెన్నై హైవే పై తాజాగా ఓ ట్రక్కు బోల్తా పడింది. మామూలుగా ట్రక్కు బోల్తా పడితే పక్కనే ఉన్న జనాలు అందరూ వచ్చి ట్రక్కు లో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ట్రక్కు బోల్తా పడగానే చుట్టుపక్కల జనాలు అందరూ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బోల్తా పడింది మద్యాన్ని తరలిస్తున్న ట్రక్కు. దీంతో చుట్టుపక్కల జనాలందరూ ఎగబడి మరీ మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్నారు.
కొంతమంది ఏకంగా తమ దుస్తులనే సంచులు గా మార్చుకొని అందులో భారీగా మద్యం వేసుకొని వెళ్ళిపోతున్నారు. బోల్తా పడిన ట్రక్కు డ్రైవర్ కి దెబ్బలు ఏమైనా తగిలాయా అని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఘటన ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ట్రక్ బోల్తా పడిన దగ్గర భారీగా మద్యం సీసాలను తీసుకెళ్లేందుకు జనం గుమికూడడంతో ఎంతో కోలాహలంగా మారిపోయింది.