అది చంద్రబాబు బలహీనత: విజయసాయి రెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసారు. తన మార్క్ లో చంద్రబాబుపై ఆయన ఎల్లో మీడియా అంటూ కూడా విమర్శలు చేసారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే, వారి హితం కోసం ఆరాటపడాలని ఆయన చంద్రబాబుకి సూచించారు.
పబ్లిసిటీ కోసం కాదని హితవు పలికారు. ఇక మీడియా మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేసారు. కుల మీడియా ఊతకర్రలను నమ్ముకుని తానొక శిఖర సమానుడిగా నిత్యం భ్రాంతిలో మునిగి తేలుతుంటాడు బాబు అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేసారు. అందుకే ఎవరికీ సంబంధం లేని వ్యక్తయి పోయాడని అన్నారు. దాన్నుంచి బయటపడలేని బలహీనత ఆయనదని ఎద్దేవా చేసారు.
ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే, వారి హితం కోసం ఆరాటపడాలి. పబ్లిసిటీ కోసం కాదు. కుల మీడియా ఊతకర్రలను నమ్ముకుని తానొక శిఖర సమానుడిగా నిత్యం భ్రాంతిలో మునిగి తేలుతుంటాడు బాబు. అందుకే ఎవరికీ సంబంధం లేని వ్యక్తయి పోయాడు. దాన్నుంచి బయటపడలేని బలహీనత ఆయనది. — Vijayasai reddy v (@VSReddy_MP) June 23, 2020